26-04-2025 06:44:50 PM
నిర్మల్ (విజయక్రాంతి): యాసంగిలో రైతులు పండించిన వారి ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఐకెపి ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని డి ఆర్ డి ఓ శ్రీనివాస్ తెలిపారు. శనివారం దిల్వార్పూర్ మండలంలో గుండె పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల అవసరాల మేరకు పౌరసరఫల శాఖ ఆదేశాలతో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు రైతులు ఉన్నారు.