15-04-2025 01:28:59 AM
కరీంనగర్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): నగరంలోని భగత్ నగర్ లో గల అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో అట్టహాసంగా యూకేజీ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు నాటికలు & నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.