calender_icon.png 18 October, 2024 | 7:40 PM

పట్టభద్రులు ఓటర్ నమోదు చేసుకోవాలి

18-10-2024 05:16:40 PM

కుమ్రంభీం అసిఫాబాద్, (విజయక్రాంతి): పట్టభద్రులు ఓటర్ నమోదును చేసుకోవాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మద్దతుగా బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వాంకిడి మండలం బండారలోని డిగ్రీ కళాశాలలో ఉచిత ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆవిడపు ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టభద్రుడు పూర్తిస్థాయిలో ఓటర్ నమోదు చేసుకోవాలని రానున్న ఎన్నికల్లో నిరుద్యోగులకు అండగా ఉంటూ ఉద్యోగుల సమస్యల పట్ల పోరాటం చేసే ఉత్తమ నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు. ఓటర్ నమోదు కోసం ఫోన్ నెంబర్ 9010785499 ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొట్టుపల్లి సాయి కృష్ణ ,కళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య, అధ్యాపకులు విలాస్, మల్లేశం, స్వామి, రామచందర్, కవిత తదితరులున్నారు.