యాదాద్రి భువనగిరి, జూలై 14 (విజయక్రాంతి) : యాదగిరిగుట్టలో ఆదివారం పీర్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పట్టణం లోని కొత్త గుండ్లపల్లి, బీసీ కాలనీల్లో పీర్ల ఊరేగింపులో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి, ప్రజలతో కలిసి దులా ఆడారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.