calender_icon.png 10 October, 2024 | 3:25 PM

ఒకే కుటుంబంలో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు

10-10-2024 01:48:50 PM

కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఎస్సీ 2024 ఫలితాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం ఎర్రాయి గూడెం గ్రామానికి చెందిన కుంజ వెంకయ్య కుమార్తె కుంజ రమ్య, కుమారుడు కుంజ రఘు లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఒకే కుటుంబంలో డీఎస్సీ అర్హత సాధించిన విద్యార్థులను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, రాజకీయ నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంకితభావంతో కష్టపడి చదివితే ఎంతటి ప్రభుత్వ ఉద్యోగమైన అర్హత సాధించవచ్చని, పట్టుదలతో చదవాలని, ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచి ప్రణాళిక కలిగి పరీక్షల కొరకై ప్రిపేర్ కావాలని సూచించారు. చదువుల విషయంలో మా గిరిజన బిడ్డలకు మా వంతు సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు.