భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల 17 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిపిఎల్ గెస్ట్ హౌస్ చేరుకొన్నారు. ఉదయం 9:30 గంటలకు పోలీసు గౌరవం స్వీకరించి రెడ్ క్రాస్ భవన ప్రారంభోత్సవానికి బయలుదేరారు.