calender_icon.png 28 October, 2024 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యనగర్ బోనాల వేడుకలకు హాజరైన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

07-07-2024 08:11:33 PM

హైదరాబాద్ :  గోల్కొండ ఆశఢమాస బోనాలు ఆదివారం వైభవంగా ప్రారంభమైన్నాయి. భాగ్యనగర్ బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  ఈ వేడుకలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలలకొంది. దీంతో మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకుని అమ్మవారికి మెక్కులు చెల్లించుకుంటున్నారు. శివసత్తుల ఆటలు, పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువుల నడుమ భక్తుల సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజ్ భవన్ లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.