calender_icon.png 22 October, 2024 | 11:19 PM

రైతు సంక్షేమానికి ప్రభుత్వ పెద్దపీట

19-10-2024 12:33:12 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు

రామాయంపేట/చిన్నశంకరంపేట, అక్టోబర్ 18: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. చిన్నశంకరంపేట, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట, హవేళీఘణపూర్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 473 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.