calender_icon.png 17 October, 2024 | 5:54 PM

మత్సకారుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

17-10-2024 03:11:21 PM

బీబీనగర్ చెరువులో చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి 

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): మత్స్యకారుల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మత్స్యకారులకు 100% సబ్సిడీతో ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం బీబీనగర్ చెరువులో చేప పిల్లలను వదిలిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్, ఫిషరీస్ అధికారులు, మత్స్యకారులు, నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేసారని, ఈ ప్రభుత్వంలో నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. మత్స్యకారుల అభివ్రుద్దే కాంగ్రెస్ పార్టీ ద్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.