బీబీపేట్: కామారెడ్డి జిల్లా బీబీపేట్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేక పురుగులమందు తాగింది. మృతురాలిని లాస్య(35)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.