calender_icon.png 21 September, 2024 | 4:08 PM

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలి

28-07-2024 12:13:54 AM

ముషీరాబాద్, జూలై 27: ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారికి అండగా నిలవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘మగ్గం నడవాలి బతకాలి’ పేరుతో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చేనేత కార్మికులకు విద్యుత్, గ్యాస్ సబ్సిడీతో పాటు పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జేఏసీ నేతలు ఆడెపు భాస్కర్, దామోదర్, లక్ష్మీనారాయణ, మధుగౌడ్, సురేశ్, శంకర్, సిరిసిల్ల నవీన్, రాజేశం, సీపీఎం నేతలు భూపాల్, స్కైలాబ్ బాబు తదితరులు పాల్గొన్నారు.