15-02-2025 01:06:05 AM
నారాయణపేట, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేం దుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారుల డైరీనీ జిల్లా కలెక్టర్ స్మితా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులను అభినందించారు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి , విజయవంతం చేసినందుకు గాను జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. శాఖ పరంగా ఏ విధమైన సహకారాన్ని అయిన అందించడానికి ఎల్లపుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ నగేష్, హైమవతి, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.