21-03-2025 01:54:33 AM
డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): పేదల కార్పొరేట్ దవానగా పేరొందిన నిమ్స్ అభివృద్ధిలో ప్రభుత్వ భాగస్వామ్యం ఎంతో కీలకమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో నిమ్స్కు ప్రాధాన్యత ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు.
తాము అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దా రాజనర్సింహ నిమ్స్కు రూ. కోట్లు కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎక్కడా ఎ ఇబ్బందులు లేకుండా వైద్యు ఉద్యోగులు శక్తివంచన లేకుండా ని సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు.
కార్పొరేట్ హాస్పిటళ్లకు భిన్నంగా ఎప్పటికప్పుడు ఆధునిక పరికరాలను కొనుగోలు చేస్తూ సేవల్ని విస్తరించడంతో పాటు వేగంగా వైద్యమం దిం చేలా చేస్తున్నామన్నారు. నిమ్స్ చైర్మన్గా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి దామో రాజనర్సింహ ఆసుపత్రి అభివృద్ధి పత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో నిమ్స్ సేవలు మ మంది పేదలకు అందించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.