calender_icon.png 11 October, 2024 | 2:55 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

11-10-2024 12:43:09 AM

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, అక్టోబర్ 10 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని మద్దులపల్లి ఏఎంసీ పరిధిలో నిర్వహించిన నూతన ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

వారితో ప్రమా ణ స్వీకారం చేయించారు. ఏఎంసీ చైర్మన్‌గా బైరు హరనాథబాబు ప్రమాణం చేశారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. మార్కెట్ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..

ఏఎంసీ పనులను కేవలం మూడు నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. తమ ప్రభు త్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.