రాష్ట్ర వైద్యానికి శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర వైద్యాధిక శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఆదివారం జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం పాల్గొని మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసి తీరుతుందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు అందుబాటులో ఎరువులు విత్తనాలు ఉంచడం జరిగిందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృత్యాలన్నారు. రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉండి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.