calender_icon.png 26 October, 2024 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం హామీలను అమలు చేస్తుంది

26-10-2024 12:17:06 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

వికారాబాద్ రూరల్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మహాలక్ష్మిపథకంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో ఏటేటా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మీపథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తోందని తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గానికి 7 వేల ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని తెలిపారు.

ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులందరికీ సొంత ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీవో వాసు చంద్ర, యంపీడీఓ వినయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ మహిపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.