calender_icon.png 28 September, 2024 | 4:53 AM

ఆఫీసులోనే ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

27-09-2024 01:08:12 AM

గద్వాల (వనపర్తి), సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): జిల్లా కేం ద్రంలోని కేఎల్‌ఐ క్యాంప్‌లోని డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ నంబర్ 1 కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అశోక్‌కుమార్ తన కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన అశోక్‌కు మార్(41) పెబ్బేర్ పీజేపీ కార్యాలయం ఈఈ డివిజన్ 1లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేశారు. ఇటీవల గద్వాల పీజేపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. గురువారం ఉదయం పీజేపీ కార్యాలయ గది తెరవడానికి వచ్చిన అటెండర్‌కు అశోక్‌కుమార్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు, గద్వాల టౌన్ పోలీసులు, ఇరిగేషన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.