calender_icon.png 4 October, 2024 | 6:55 PM

క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి

04-10-2024 04:58:08 PM

సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి  చేతుల మీదగా ప్రారంభించబడిన సీఎం కప్ 2024 టార్చ్ ర్యాలీ హైదరాబాద్ నుండి వికారాబాద్ మీదుగా సంగారెడ్డికి చేరుకున్నది. సంగారెడ్డి పట్టణ కేంద్రంలో పెద్దాపూర్ లో డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ కి  ఘన స్వాగతం పలికారు.

TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి,TNGOS జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఘన స్వాగతం పలికారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం త్వరలో జరగబోయే సీఎం కప్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ క్రీడాకారులు పాల్గొనే విధంగా అవగాహన కల్పించడమే ముఖ్య లక్షమని DYSO కాసిం బేగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరమేష్, TNGOS నాయకులు వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ DYSO వెంకటేశ్వర్లు, సీఎం కప్ సీఎం కప్ కాన్వాయ్ ఇంచార్జ్ CI మధు, యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు తోపాటు క్రీడాకారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.