హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లాభాల్లో వాటాను దసరా ముందు సింగరేణి కార్మికులకు రూ.796 కోట్ల బోనస్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో సింగరేణి కార్మికుడికి సగటున రూ.1.90 లక్షల బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కంటే రూ.20 వేలు అదనంగా అందజేస్తుంది. సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.5 వేల బోనస్ అందించి దసరా ముందు సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూడాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ.4,710 కోట్లు రాగా.. 33 శాతాన్ని బోనస్ గా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.