మంత్రి తుమ్మల
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో మూ డు వ్యవసాయ మార్కెట్ కమిటీకు పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వు లు జారీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ నల్లగొండ జిల్లా నిడమనూరు, హనుమకొండ జిల్లా ఆత్మ కూరు, నారాయణ్పేట జిల్లా కొస్గ్గీ మార్కెట్లకు పాలకవర్గాన్ని నియమించినట్లు వెల్లడించారు. ఈసంద ర్భంగా కొత్తగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.