calender_icon.png 10 October, 2024 | 3:46 AM

మరో ఏడు ఏఎంసీలకు పాలకవర్గాలు

10-10-2024 01:42:43 AM

 హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మరో ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు  సభ్యులను నియమించింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని ఇల్లందు, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, నిర్మల్ జి ల్లాలోని నిర్మల్,  సారంగాపూర్, మే డ్చల్, జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు(ఏఎంసీలకు) పాలకవర్గాన్ని నియమించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 88 వ్యవసా య మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.