calender_icon.png 28 October, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్ పమేలా సత్పతి

24-07-2024 05:13:03 PM

కరీంనగర్: గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్ అధికారులు ఎస్డీసీతో భూసేకరణ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో భూసేకరణ పనులు ఎంతవరకు వచ్చాయి. ఇంకా ఎన్ని ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. ఎప్పటి వరకు పూర్తి చేస్తారు.. ఇబ్బందులు ఉన్నచోట తీసుకుంటున్న చర్యలు ఏంటి అని అధికారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూసేకరణ పై పలు అంశాలను దిశానిర్దేశం చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు  ఎక్కడ ఎలాంటి జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్న చోట అధికారులు వెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ భూసేకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈ మేరకు అధికారులు భూసేకరణ పూర్తి చేసి త్వరగా పనులు చేపట్టేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి కిరణ్, ఎల్ఎండి ఈఎంసి శంకర్, ఎల్ఎండి ఎస్ ఈ శివకుమార్, ఎస్ డి సి కిరణ్ ప్రకాష్ పలువురు అధికారులు పాల్గొన్నారు.