22-03-2025 10:28:49 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ శాంతినగర్ కాలనీలో గల శనివారం శ్రీ రుక్మిణి సమేత విఠలేశ్వర స్వామి దేవాలయంలో అఖండ హరినామ సప్త ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శనివారం గోపాల కాలువ కార్యక్రమాన్ని చేపట్టారు మహిళలు బోనాలతో ఆలయం నుంచి ఊరేగింపుగా సంగమేశ్వర నుండి హనుమాన్ ఆలయానికి చేరుకొని అక్కడ పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆదివారంతో సప్త ముగుస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో భక్తులు కాలనీవాసులు పాల్గొన్నారు.