బ్రిడ్జ్టౌన్: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన ఆనంద సమయాన ఇక ఈ ఫార్మాట్లో ఆడనని జడేజా వెల్లడించాడు. 2009లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన జడేజా.. కెరీర్లో 74 టీ20లు ఆడి 515 పరుగులు చేయడంతో పాటు 54 వికెట్లు పడగొట్టాడు. ‘మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నా.
దేశం కోసం ఎల్లప్పుడూ శాయశక్తులా శ్రమించా. ఇతర ఫార్మాట్లలో కొనసాగాలనుకుంటున్నా. టీ20 ప్రపంచకప్ గెలవాలనే కల నిజమైంది. ఇన్నాళ్లు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని జడేజా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. స్పిన్ ఆల్రౌండర్గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన జడేజా రిటైర్మెంట్ వేళ ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకంక్షలు తెలిపారు.