18-04-2025 06:43:13 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ ఆర్ సిఎం చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పరిశుద్ధ సిలువ మార్గం 14 స్థలాలలో యేసు క్రీస్తు వేషధారణలతో కీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా ప్రదర్శనలు చేశారు. సులానగర్ గ్రామం మొత్తం ప్రదర్శన చేశారు. ఆర్ సిఎం చర్చ్ ఫాదర్ మార్నేని అర్లయ్య దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఫాదర్ మార్నేని అర్లయ్య వాక్యాన్ని బోధిస్తూ ప్రభువు చెప్పినట్టుగా మనకు మనం తగ్గించుకుంటామో వారి జీవితాలు బాగుపడతాయి. మానవాళి పాప పరిహారార్థమై ఏసుప్రభు సిలువ మీద మరణించారనీ ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేశారు. అనంతరం 4O రోజులు ఉపవాసం ఉన్న సోదరులు సోదరీమణులు ఈ రోజు దీక్షను విరవింప చేశారు. ఈ కార్యక్రమంలో కొయగూడెం, ముత్యాలంపాడు, ముత్యాలంపాడు క్రాస్ రోడ్, సులానగర్ గ్రామాల క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.