01-04-2025 02:02:39 AM
కడ్తాల్, మార్చి 31 ( విజయ క్రాంతి ) : కడ్తాల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థికసాయం అందజేశారు. కడ్తాల్ గ్రామానికి చెందిన జిఎస్ ఆర్ యువ సేన నాయకుడు ముత్యాల శంకర్ నాయనమ్మ ముత్యాల పోచమ్మ అనారోగ్యంతో మృతి చెందింది.
సోమవారం విషయం తెలుసుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ. 4వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మణి, నవీన్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.