నాగర్కర్నూల్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగులో నుంచి 9 తులాల బంగారం చోరీకి గురయింది. నాగర్కర్నూల్ 10వ వార్డుకు చెందిన ఎన్ సువర్ణ బుధవారం హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లాక తన కుమారుడికి టికెట్ కొనేందుకు బ్యాగు నుంచి డబ్బులను తీసే క్రమంలో అందులో ఉన్న 9 తులాల బంగారం కనిపించలేదు.
కండెక్టర్కు సమాచారం ఇవ్వగా తాడూర్ పోలీస్ స్టేషన్లో బస్సు నిలిపి ప్రయాణికులను సోదా చేశారు. అప్పటికే రెండు మూడు స్టేజీలు వెళ్లిపోవడంతో నిందితులు దిగినట్లుగా అనుమానించారు. అనంతరం నాగర్కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.