calender_icon.png 13 October, 2024 | 12:48 PM

తాన్యకు స్వర్ణం

29-09-2024 12:00:00 AM

పాట్నా: ఇండియన్ ఓపెన్ అండర్-23 అథ్లెటిక్స్ మీట్‌లో తొలి రోజే పలు రికార్డులు కనుమరుగయ్యాయి. మహిళల హామర్ త్రోలో యూపీకి చెందిన తాన్య 54.42 మీటర్ల దూరంతో కొత్త రికార్డును నెలకొల్పడమే కాకుండా స్వర్ణం కైవసం చేసుకుంది. మహిళల ట్రిపు ల్ జంప్‌లో మహారాష్ట్రకు చెందిన పూర్వ 13.25 మీటర్ల దూరం దూకి స్వర్ణం సాధించింది. పురుషుల షాట్‌పుట్‌లో అమన్‌దీప్ సింగ్ పసిడి పతకం సాధించాడు.