calender_icon.png 19 September, 2024 | 7:25 AM

స్వల్పంగా పెరిగిన బంగారం

28-07-2024 01:06:58 AM

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ ప్రకటించినప్పటినుంచీ గత నాలుగు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం కాస్త పెరిగాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.250 పెరిగి 63.250కి చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ.69,000 కు చేరింది. బెంగళూరు, ముంబయి, ఢిల్లీలలో కూడా ఇలాగే ధరలు పెరిగాయి. అయితే చెన్నైలో మాత్రంఅత్యధికంగా  22 క్యారెట్లు రూ. 500, 24 క్యారెట్లు రూ.550 పెరిగింది.