మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వెంటనే ప్రారంభించేందుకు సీఎం రేవంత్రెడ్డి అనుమతి ఇచ్చినట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.