03-03-2025 07:06:28 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): ములుగు జిల్లా మేడారంలో ఆదివారం జరిగిన స్టేట్ లెవెల్ కరాటే ఛాంపియన్ లో సారపాకకు చెందిన 22 మంది విద్యార్థులు వివిధ కేటగిరీలో బంగారు పతకాలు సాధించారు. ఈ పతకాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా అందుకున్నారు. మంత్రి సీతక్క, తెలంగాణ పోలీస్ కరాటే ట్రైనర్ పాయం సురేష్ కరాటే ప్రాముఖ్యత గూర్చి తెలుపుతూ విద్యార్థులకు ప్రశంసలు అందించారు. విద్యార్థులకు కోచ్ మాస్టర్ బి కిరణ్, కొత్తగూడెం ప్రెసిడెంట్ వారిని అభినందించారు.