పట్నా: అండర్-23 అథ్లెటిక్స్ మీట్లో ఒడిశా స్ప్రింటర్ అనిమేశ్ కుజుర్ 200 మీ రేసులో స్వర్ణం గెలుచుకున్నాడు. అనిమేశ్ రేసును 20.65 సెకన్లలో పూర్తి చేసి తన పేరిటే ఉన్న గత రికార్డును (20.87 సెకన్లు) తిరగరాశాడు. ఇక గుజరాత్కు చెందిన దేవ్యానిబా మహిళల 400 మీటర్ల రేసును 53.53 సెకన్లలో పూర్తి చేసి పసిడి ఒడిసిపట్టింది. 100 మీటర్ల రేసును 11.76 సెకన్లలో పూర్తి చేసిన సుదేశ్నా జాతీయ రికార్డుతో మెరిసింది.