calender_icon.png 28 October, 2024 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సును ఓవర్‌టేక్ చేయబోయి..

28-10-2024 12:30:11 AM

  1. ఆటోను ఢీకొట్టిన కారు
  2. నలుగురికి గాయాలు

శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (విజయక్రాంతి): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న ఓ కారు హెచ్‌సీయూ వద్ద బస్సును ఓవర్ టేక్ చేయబోయి పక్కనే ఉన్న ఆటోని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. స్థానికులు కారులో ఇరుక్కున్న డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు.

గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను బీరంగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారులో మొత్తం ముగ్గురు ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.