calender_icon.png 24 October, 2024 | 5:52 AM

మంథనిలో ఉప్పొంగిన గోదావరి నది

02-09-2024 11:00:33 AM

బందోబస్తు చర్యలు చేపట్టిన మంథని ఎస్ఐ రమేష్

మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది ఉప్పొంగింది. ఆదివారం సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో సుందిళ్ల మ్యారేజ్ వద్ద కూడా గేట్లు తీసి నీటిని కిందికి వదిలారు. దీంతో నీటి ప్రవాహం పెరగడంతో మంథని గౌతమేశ్వర ఆలయం వద్ద మంథని సీఐ అదేశాలతో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దుబాసి రమేష్ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగువకు 1.44 లక్షల క్యూ సెక్ ల నీరు విడుదల చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంథని ఎస్ఐ కోరారు.