calender_icon.png 19 September, 2024 | 9:39 PM

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

27-07-2024 04:14:56 PM

రాజమహేంద్రం: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం అంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన వరద ప్రవాహం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి నీటిమట్టం 52.6 అడుగులకు చేరింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరదనీరు భారీ స్థాయిలో ఎగువ ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం వైపుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 13.75 అడుగులు కొనసాగుతుంది. సముద్రంలోకి 13 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.