హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూ పందాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం కాటన్ బరాజ్ వద్ద 13.75 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. దీంతో అధికారులు బరాజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వర ద క్రమంగా పెరుగుతుండటంతో గేట్లు ఎత్తి సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. దీంతో ముంపు ప్రాంతాలతోపాటు లంక గ్రామాలు తీవ్ర భయాందో ళనకు గురవుతున్నాయి.