28-02-2025 02:12:02 AM
ఏర్గట్ల, పిబ్రవరి 27:(విజయ క్రాంతి): మండలంలోని బట్టాపూర్ తండాకు చెందిన మూడ్ గంగారాం లక్ష్మి ల కూతురు గోదావరికి రాష్ట్ర మహిళా పోలీస్ కబడ్డీ జట్టులో చోటు దక్కినట్లు, మార్చి 2నుండి 6 వరకు పంజాబ్ రాష్ట్రం లోని జలంధర్ లో జరిగే జాతీయ స్థాయి పోలీస్ మహిళల కబడ్డీ పోటీలో పాల్గొనా నున్నట్లు గోదావరి కుటుంబ సభ్యులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కోచ్ మీసాల ప్రశాంత్, పోలీస్ అధికారులు, సీనియర్ క్రీడాకారులు, వ్యాయమ ఉపాధ్యాయులు తెలిపారు. గోదావరి ప్రస్తుతం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాట్లు వారు తెలిపారు.