calender_icon.png 4 October, 2024 | 2:50 PM

దేవుడా క్షమించు..

04-10-2024 01:27:05 AM

ప్రయాగ్‌రాజ్ (ఉత్తర్‌ప్రదేశ్), అక్టోబర్ 3: ఆలయంలోని దేవుడి విగ్రహాలను చోరీ చేసిన దొంగ వాటిని తిరిగిచ్చేశాడు. యూపీ లోని నవాబ్‌గంజ్‌లోని ప్రసిద్ధ గౌఘాట్ ఆశ్రమంలోని రాధాకృష్ణ విగ్రహాలు గతనెల 23వ తేదీ రాత్రి చోరీకి గురయ్యాయి. దీనిపై ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదుచే శారు. బుధవారం ఆశ్రమ వద్ద ఓ వ్యక్తి గోనెసంచిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. గమనిం చిన స్థానికులు దానిని తెరిచి చూడగా అం దులో రాధాకృష్ణుడి విగ్రహాలతో పాటు ఓ లేఖ ఉంది. దేవుడి విగ్రహాలు దొంగతనం చేసినప్పటి నుంచి తనను పీడకలలు వెంటా డుతున్నాయని, ప్రశాంతంగా తినలేకపోతు న్నా, నిద్ర లేకపోతున్నాని రాశాడు. అందుకే తిరిగి ఇచ్చేసినట్లు వెల్లడించాడు.