పటాన్ చెరు, ఫిబ్రవరి 2 : ప్రపంచంలోని ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే అజ్మీర్ షరీఫ్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తరపున జీఎంఆర్ యువసేన సభ్యులు ఆదివారం ’చాదర్’ సమర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ యువసేన సభ్యులు సోహెల్, మసూద్, ఆదిల్, దిల్షాద్, ఇర్ఫాన్, వినయ్, సహిల్ తదితరులు పాల్గొన్నారు.