01-04-2025 06:51:43 PM
ఆర్ధిక సంవత్సరంలో 104 శాతంతో ముందంజ..
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు ఏరియా జిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన పత్రిక సమీక్షా సమావేశంలో మార్చి నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఏరియా జి.యం వీసం కృష్ణయ్య తెలిపారు. మార్చి - 2025 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 5.45 లక్షల టన్నులకు గాను, 3.33 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 61 శాతం ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. అలాగే 1.74 లక్షల టన్నుల బొగ్గు రైల్వే మార్గం ద్వారా, 0.75 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా, ఆర్.సి.హెచ్.పి ద్వారా 1.10 ఇల్లందు ఏరియాలో మొత్తం 3.58 లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేయడం జరిగిందని తెలిపారు.
మార్చి నెలలో 45 రేకుల ద్వారా బొగ్గు రవాణా చేసామని తెలిపారు. అదేవిధంగా ఇల్లందు ఏరియాకు కేట౦చిన వార్షిక బొగ్గు లక్ష్యం 41.30 లక్షల టన్నులకు గాను 42.75 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 104 శాతంతో అన్ని ఏరియాల కంటే ప్రథమ స్థానం లో నిలిచింది. రక్షణతో మరియు క్వాలిటీ తో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేసిన సంబంధిత అధికారులు, సూపర్వైజర్స్, యూనియన్ నాయకులకు మరియు ఉద్యోగులకు జి.యం ప్రత్యేకం అభినందనలు తెలిపారు.