calender_icon.png 28 September, 2024 | 4:53 AM

జయసూర్య ప్రతాపం

24-09-2024 12:00:00 AM

చిత్తుగా ఓడిన కివీస్

శ్రీలంకదే తొలి టెస్టు

గాలె: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై జరిగిన టెస్టు మ్యాచ్‌లో కివీస్‌ను 63 పరుగుల తేడాతో చిత్తు చేసి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 207/8 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన కివీస్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి మిగతా రెండు వికెట్లు కోల్పోవడంతో లంక విజయాన్ని అందుకుంది. రచిన్ రవీంద్ర (92) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్లండెల్ (30) పర్వాలేదనిపించాడు. ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్ల హాల్ నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. రమేశ్ మెండిస్ 3 వికెట్లు పడగొట్టాడు.  జయసూర్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి ఇదే స్టేడియంలో మొదలుకానుంది.