calender_icon.png 28 October, 2024 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ర్యాలీ

13-07-2024 04:47:36 AM

  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహణ 
  • ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్

ముషీరాబాద్, జూలై 12: దేశ అభివృద్ధి, ప్రజల సుభిక్షం కోసం కులమతాలు, రాజకీయాలకు అతీతంగా గ్లోబల్ పీస్ సంస్థ ఆధ్వ ర్యంలో అక్టోబర్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గ్లోబల్  పీస్ ర్యాలీ, జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ తెలిపారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లో ర్యాలీ, సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. దేశ ఆర్థిక పరిస్థితిని నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు. అందుకు దేశంలోని 29 రాష్ట్రాల సీఎంలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకు లు, జర్నలిస్టులు, మేధావులు, ఎంపీలు తన కు మద్దతు ఇవ్వాలని కోరారు. ర్యాలీ, సదస్సును విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.