సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజ యక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో ఐటీ కంపెనీలన్ని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అవకాశం కల్పించాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు. ఐటీ ఉద్యోగుల రక్షణే ఎంతో ముఖ్యమని సూచించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడొచ్చని తెలిపారు. దీంతోపాటు ట్రాఫిక్ సమస్యను తగ్గించ డానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.