calender_icon.png 9 October, 2024 | 9:54 AM

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇవ్వండి

09-10-2024 01:36:53 AM

సీఎం సలహాదారుడు వేంరెడ్డి నరేందర్‌రెడ్డికి వినతి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): దసరా కానుకగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇప్పించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు సీఎం సలహాదారుడు వేంరెడ్డి నరేందర్ రెడ్డిని మంగళవారం ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందించారు.

ఇప్పటికే ఇవ్వాల్సిన రెండు డీఏలను గత ప్రభుత్వం ఇవ్వ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం డీఏ ఇస్తుందనే ఆశలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు రామకృష్ణ, డా.జి.నిర్మల, పాక రమేష్ పాల్గొన్నారు.