calender_icon.png 3 October, 2024 | 6:55 PM

బెయిల్ ఇవ్వండి.. అవార్డు తీసుకుంటా

03-10-2024 01:27:07 AM

కోర్టులో జానీ మాస్టర్ పిటిషన్

రాజేంద్రనగర్, అక్టోబర్ 2: లైంగికదాడి కేసులో నార్సింగి పోలీసులు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, తాను అవార్డు అందుకోవాలని, ఐదు రోజులపాటు బెయిల్ ఇవ్వాలని తన తరఫున న్యాయవాది ద్వారా రంగారెడ్డి జిల్లా కోర్టు లో బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ‘నాకు ఇటీవల ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు వచ్చింది..

దాని కోసం ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవాల్సి ఉంది.. అందుకుగాను ఐదురోజుల పాటు బెయిల్ ఇవ్వం డి’ అని జానీ మాస్టర్ కోర్టును అభ్యర్థించాడు. కాగా, ఈ పిటిషన్‌పై ఈ నెల 7న విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా కొరియోగ్రాఫర్ బెయిల్ పిటిషన్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నార్సింగి పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

నిందితుడు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని, అతడికి బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో మంజూరు చేయొద్దని పిటిషన్ వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.