- నన్ను శారీరకంగా వాడుకొని వదిలేశాడు
- రాజ్తరుణ్ ప్రేయసి లావణ్య ఫిర్యాదు
- డ్రగ్స్ కేసులో ఇరికించారని మండిపాటు
- గుడిలో వివాహం చేసుకున్నామని వెల్లడి
రాజేంద్రనగర్, జూలై 5: సినీ నటుడు రాజ్తరుణ్కు అమ్మాయిల పిచ్చి అంటూ అతడి ప్రేయసి లావణ్య సంచలన ఆరో పణలు చేసింది. రాజ్తరుణ్పై శుక్రవారం లావణ్య నార్సింగి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా వాడు కొని వదిలేశాడని ఆరోపించింది. రాజ్ తరుణ్, తాను 11 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నామని, ఓ గుడిలో వివాహం చేసుకు న్నామని ఫిర్యాదులో పేర్కొంది.
అయితే, ఈ ఏడాది జనవరి 30న లావణ్యను నార్సింగి పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. అప్పుడే ఆమె రాజ్తరుణ్ ప్రేయసి అని వెలుగులోకి వచ్చింది. తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరో పించింది. తాను 45 రోజులు జైలులో ఉ న్నా రాజ్తరుణ్ ఎలాంటి సాయం చేయ లేదన్నారు. రాజ్తరుణ్ను వదిలివేయాలని అతడి సోదరుడు బెదిరిస్తున్నాడని ఆరో పించింది. రాజ్తరుణ్ తనను మోసం చేసి మరో హీరోయిన్తో రిలేషన్ కొనసాగి స్తున్నాడని పేర్కొంది. ప్రస్తుతం రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉన్న యువతికి సం బంధించిన వాళ్లు కూడా తనను బెదిరిస్తు న్నారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేప ట్టిన ట్లు నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణాడ్డి తెలిపారు.
లావణ్య ఆరోపణల్లో నిజం లేదు
- మా మధ్య రిలేషన్ వాస్తవమే
- ఆమె డ్రగ్స్ వాడుతున్నది
- హీరో రాజ్తరుణ్
లావణ్య ఆరోపణల్లో ఏమాత్రం వా స్తవం లేదని హీరో రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. తామిద్దరం రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. లావణ్య కొంతకాలంగా డ్రగ్స్ వాడడంతో దూరం పెట్టానని, వేరే వ్యక్తితో రిలేషన్లో ఉన్నదని పేర్కొన్నారు. లావణ్య తన నుంచి డబ్బు ఆశించి, ఈ డ్రామాకు తెరతీసిందని మం డిపడ్డారు. తనను చాలా ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. కన్నతండ్రిని కూడా లావణ్య మోసం చేసిందని తీవ్రస్థాయిలో రాజ్తరుణ్ మండిపడ్డారు. లావ ణ్య ఫిర్యాదు నేపథ్యంలో మీడియాకు పైవిషయాలు వెల్లడించారు.