calender_icon.png 22 October, 2024 | 12:22 AM

జాతీయస్థాయిలో గిరి బిడ్డ ప్రతిభ

21-10-2024 05:51:56 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జాతీయస్థాయి అథ్లెటిక్ క్రీడల్లో జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థిని ఇటీవల ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో ఆలం శైలజ అండర్ 14 విభాగంలో జావిలిన్ త్రో క్రీడల్లో బ్రాంజ్ మెడల్ సాధించి తన ప్రతిభను చాటింది. సోమవారం గిరిజన సంక్షేమ శాఖ డిడి రమాదేవి విద్యార్థిని అభినందించారు. సందర్భంగా డిడి మాట్లాడుతూ.. గిరిజన క్రీడా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు ఎంతో నైపుణ్యం కనబరుస్తున్నారని ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఎం.ఓ. పూర్క ఉద్దవ్, గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, ఏటీడీఓ చిరంజీవి, జిసిడిఓ శకుంతల, అథ్లెటిక్ కోచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.