calender_icon.png 23 October, 2024 | 10:03 AM

రామగిరి మండల అఖిల భారత యాదవ సంఘం మండలాధ్యక్షుడిగా గిరవేన రాములు యాదవ్

22-07-2024 04:13:18 PM

మంథని, (విజయక్రాంతి): రామగిరి మండల అఖిల భారత యాదవ సంఘం మండలాధ్యక్షుడిగా గిరవేన రాములు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మండల కమిటీని జిల్లా యాదవ సంఘం నాయకులు ప్రకటించారు. తనపై నమ్మకంతో ఈ పదవీ బాధ్యతలు అప్పగించిన జిల్లా, మండల నాయకులకు రాములు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.