calender_icon.png 18 April, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో జిహెచ్‌ఎంసి యుజీడీ డైరెక్టర్ శ్రీనివాస్

16-04-2025 12:00:00 AM

ఓ కాంట్రాక్టు నిమిత్తం రూ. 2లక్షల20 వేల  డిమాండ్

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15: లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ గా శ్రీనివాస్   విధులు నిర్వర్తిస్తూ గత కొంతకాలంగా చాంద్రాయణగుట్ట సర్కిల్ లో అర్బన్ బయోడైవర్సిటి విభాగం ఇంచార్జిగా  వ్యవహరిస్తున్నారు.

చాంద్రా యణ గుట్ట సర్కిల్లో అర్బన్ బయోడైవర్సిటీ  వింగ్లో  రూ. 45 లక్షల మొక్కల కాంట్రాక్టు  కు సం బంధించిన బిల్లులను చెల్లించేందుకు  కాంట్రాక్టర్ శ్రీనివాస్ ను రూ . 2 లక్షల 20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో తొలివిడతగా కాంట్రాక్టర్ అధికారికి  రూ. 1లక్ష 50 వేలు ముట్టచెప్పాడు. మరో విడుతలో రూ. 70వేలు లంచం ఇవ్వాల్సి ఉంది.

అయితే అట్టి డబ్బులు రూ . 70 వేలు లంచం డబ్బులు తీసుకొని సదరు కాంట్రాక్టర్ ను శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి  మంగళవారం రావాలని శ్రీనివాస్ సూచించాడు. ఇట్టి విషయం గురించి అవినీతి నిరోధక శాఖ అధికారులకు సదరు కాంట్రాక్టర్ కలిసి పిర్యాదు చేశాడు.

దీంతో రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ అధ్వర్యంలో అక్కడ మాటు వేసి ఉన్నారు. కాంట్రాక్టర్ నుంచి శ్రీనివాస్ రూ. 70 వేలు లంచం డబ్బులు తీసుకుంటుటండగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.