టాలీవుడ్లో ప్రతిభావంతులైన యువ దర్శకుల్లో మొదటి చిత్రంతోనే సత్తా చాటినవారిలో ప్రశాంత్ వర్మ ఒకరు. తెలుగులో మొదటి సూపర్ హీరో సినిమా చేసి సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. అలాంటి యువ దర్శకుడి నుంచి అప్డేట్ రావడం అభిమానులకు నిజమైన దసరా పండగే! ఈ దేవి శరన్నవరాత్రుల సమయంలోనే ఈ అక్టోబర్ 10న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) నుంచి రెండు సినిమాలను ప్రకటించనున్నారు.
మరి ఆ సినిమాలేంటో తెలియాలం టే ఒకే ఒక్కరోజు ఆగాల్సిందే. ప్రశాంత్ ప్రస్తుతం ‘జై హనుమాన్’ ప్రాజెక్టుతోపాటు, నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న సినిమాలతో బిజీగా ఉన్నా రు. ఇదిలా ఉండగా, పీవీసీయూ నుంచి మరో రెండు ప్రాజెక్టులను ప్రకటించనున్నారని ప్రచారం జరుగు తోంది. ఆ ప్రాజెక్టులు ‘పీవీసీయూ3’, ‘పీవీసీయూ4’ అని అంటున్నారు.
‘పీవీసీయూ3’కు సంబంధిం చి సినిమా పేరు ‘మహాకాళి’ అని, ‘పీవీసీయూ4’ ప్రాజెక్టుకు ‘అధీర’ అనే టైటిల్ను ఖరారు చేశారని సమాచారం. ఇదిలా ఉండగా ప్రశాంత్వర్మ ‘పీవీసీయూ3’ గురించి సాంకేతిక మాధ్యమాల్లో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు గురించి 24 సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియోను పంచుకున్నారు.
‘ఈ నవరాత్రికి శక్తి మాయాజాలాన్ని చూసేందుకు రెడీగా ఉండండి’ అనే వ్యాఖ్యాల్ని తన పోస్టుకు జోడించడం ద్వారా తన సినిమాపై ఆసక్తిని పెంచారు ప్రశాంత్వర్మ. ఈ తాజా ప్రాజెక్టు గురించి నటీనటులు, సాంకేతిక వర్గం గురించి చిత్రబృందం గురువారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.